దిల్లీ: రద్దయిన పెద్ద నోట్లను మార్చుకోవడానికి తుది గుడువు సమీస్తుండడంతో భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కార్యాలయాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. రద్దయిన నోట్లను మార్చుకోవడానికి, జమ చేసుకోవడానికి గత ఏడాది డిసెంబరును గడువుగా నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ కాలంలో విదేశాల్లో ఉన్న వారికి ఈ ఏడాది మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. ప్రవాస భారతీయులకు జూన్ 30 వరకు గడువు ఇచ్చింది. నవంబరు-డిసెంబరు మధ్య విదేశాల్లో ఉన్నవారు, పలు కారణాలతో నోట్లను మార్చుకోలేని వారు మార్చి 31 గడువు సమీపిస్తుండడంతో ప్రత్యేకించిన ఆర్బీఐ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు. ఇలాంటి వారు రద్దయిన నోట్లను మార్చుకునే సౌకర్యాన్ని ముంబయి, దిల్లీ, కోల్కతా, చెన్నై, నాగ్పుర్ ఆర్బీఐ కార్యాలయాల వద్ద మాత్రమే కల్పించారు.