ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి మద్దతుగా మహా కూటమి జాతీయ నేతలు ప్రచారం చేయనున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, డీఎంకే అధినేత ఎంకే.స్టాలిన్ ఏపీ ప్రచారంలో పొల్గొననున్నారు. చంద్రబాబు నాయుడికి ఓటేయలాంటూ ఎంపిక చేసిన జిల్లాల్లో ప్రసంగించనున్నారు. 28న బెజవాడలో అరవింద్ కేజ్రీవాల్, 31న విశాఖపట్నంలో మమత, కేజ్రీవాల్, అనంతపురం, కర్నూలులో దేవేగౌడ, చిత్తూరులో స్టాలిన్ ప్రచారం చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.