తమిళనాట రాజకీయ పార్టీ పెట్టిన ప్రముఖ నటుడు మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్హాసన్ రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యట్లేదని ప్రకటించారు. సమాన వేతనం, మహిళలకు రిజర్వేషన్లు, అందరికీ ఉద్యోగాలు లాంటి పలు అంశాలతో మేనిఫెస్టోను విడుదల చేసిన ఆయన.. రాబోయే ఐదేళ్లలో 50లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. మహిళలకు 50శాతం రిజర్వేషన్లు, ఫ్రీ వైఫై, రహదారులపై టోల్ ఫీజుల రద్దు లాంటి పలు అంశాలపై మేనిఫెస్టోలో చేర్చారు.
పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల రెండో జాబితాను ఆయన ప్రకటించారు. పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. పోటీ చేసే వారంతా తన ప్రతిరూపాలేనని, రథంలో ఉండడం కంటే రథాన్ని లాగే వ్యక్తిగా ఉండడానికే తాను నిర్ణయించుకు న్నానని అభిప్రాయపడ్డారు.