విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని, శాసనమండలి సభ్యుడు బుద్దా వెంకన్న తదితరులు ఆదివారం కలిశారు. శనివారం రవాణా శాఖ కార్యాలయం ఎదుట ఎంపీ నాని తదితరులు ఆందోళన నిర్వహించారు. ఈ విషయం కాస్త వివాదానికి దారితీసింది. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఘం టీడీపీ ప్రజాప్రతినిధులపై గుర్రుగా ఉన్న నేపధ్యంలో సీఎం చంద్రబాబు సైతం ఎంపీ నాని తదితరులపై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. కాగా చంద్రబాబును కలిసిన వారు ఆర్టీఏ కార్యాలయంలో జరిగిన వివాదంపై వివరణ ఇచ్చినట్లు సమాచారం.