కర్నూలు జిల్లాలో బీజేపీ కి షాక్ తగిలింది., ఆలూరు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోట్ల హరిచక్రపాణి రెడ్డి, పోటీనుంచితప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఆదివారం ఆయన కోడుమూరు మండలం లద్దగిరి లోని తన స్వగృహంలో అనుచరులతో జరిపిన సమావేశంలో ఈ కీలకనిర్ణయం తీసుకుని ప్రకటించడంతో ఆయన మద్దతుదారులు కూడా సమర్ధించారు. ఇక నుంచి అన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బాటలో నడుస్తానన్న కోట్ల హరిచక్రపాని రెడ్డి,కర్నూలు పార్లమెంట్ తెదేపా అభ్యర్థి అన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఆలూరు తెదేపా అభ్యర్థి వదిన కోట్ల సుజాతమ్మ విజయానికి పనిచేయనున్న చెప్పారు. చివరిక్షణంలో ఆలూరు అసెంబ్లీ ఎన్నికల నుండి తప్పుకుంటున్నట్లు కోట్లహరిచక్రపాణి రెడ్డి చెప్పడంతో ఆఖరిక్షణాన ఎవరితోనైనా నామినేషన్ వేయించే పనిలో పడింది బిజెపి.