కేఈ కోట్ల కుటుంబాలు కలిసిపోయాయి మా మధ్య ఎలాంటి సమస్యలు విభేదాభిప్రాయాలు లేవు కాబట్టి మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కర్నూల్ పార్లమెంట్ టిడిపి అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి. ఆదివారం దేవరకొండ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమావేశం లో పాల్గొన్నా ఆయన మాట్లాడుతూ తను టీడీపీలో చేరడానికి కేవలం రైతు శ్రేయస్సు కోసమేనని, వేదవతి గుండ్రేవుల ఆర్ డి ఎస్ ప్రాజెక్టు నుండి 8 లక్షల ఎకరాలకు నీరు పారుదల అందుతాయని నేను నా స్వార్థం కొరకు పార్టీ మార్చలేదని స్పష్టం చేసారు. హంద్రీనీ వా ప్రాజెక్టు నుండి 48 వేల ఎకరాలకు నీరు అందిస్తున్నామని ఆ నీరు ప్రతి ఎకరాకు వచ్చేలా కృషి చేస్తామని అన్నారు. వచ్చే రెండు సంవత్సరాలలో కర్నూల్ లో రైతులు బ్రతుకులు మార్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక్కడ టమోటా ఎక్కువగా పండుతోంది. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వీరికోసం జ్యూస్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని రైతులకు హామీ ఇస్తున్నామని, ఇప్పటికే ముఖ్యమంత్రితో ఈ విషయం మాట్లాడినట్టు చెప్పారు. జిల్లా అభివృద్ది కోసమే కేయి గ్రూపు కోట్ల గ్రూపు అని విభేదాలు లేకుండా ఎటువంటి అభిప్రాయ విభేదాలు లేకున్నా కలిసికట్టుగా పనిచేస్తామని, జిల్లాలోని అన్ని స్థానాలు తెలుగుదేశం మేజార్టీ తో గెలిపించాలని కోట్ల పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో లక్కసాగరం లక్ష్మీకాంతరెడ్డి టిడిపి మండల కన్వీనర్ విజయ భాస్కర్ గౌడ్ సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఉచ్చీరప్ప ,సర్పంచ్ రంగన్న, వేణు కుమార్ మల్లికార్జున గౌడ్, రాజయ్య రాజా సాహెబ్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు