విజయవాడ: విజయవాడలోని రవాణాశాఖ కార్యాలయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తనిఖీల పేరుతో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటూ.... కార్యాలయంలో ఎంపీ కేశినేని నాని భైఠాయించారు. అనంతరం అధికారులతో వాగ్వాధాన్ని పెట్టుకున్నారు. ప్రైవేటు బస్సులకు అడ్డగోలుగా పర్మీషన్లు ఇస్తున్నారని ఎంపీ కేశినేని నాని అన్నారు. తనిఖీలు చేయకుండా బస్సులను తీసుకుంటున్నారు. అధికారుల తీరుతో ప్రతిపక్షాలతో మాటలు పడాల్సి వస్తుందన్నారు. ప్రైవేట్ బస్సులతో ఆర్టీసీకి నష్టం వస్తోందన్నారు.