విజయవాడ, సూర్య బ్యూరో : నవ్యాంద్ర నూతన రాష్ట్రంలో ఏపీ స్పేస్ అప్లి ేషన్స్ సెంటర్ 13 జిల్లాలకు చెందిన 35 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్ధులను అకార ణంగా తొలగిస్తే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని ఏపీ బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నగరంలో ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ కాంట్రాక్ట్ ఉద్యో గుల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్థుల ధర్నాకు మద్దతు తెలియ జేసారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ ఈ సంస్ధను నమ్ము కుని గత పదిహేను సంవత్సరాలుగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల కాంట్రాక్ట్ను పొడిగించకపోక గతంలో పనిచేసిన ఐదు నెలల జీతాన్ని నిలుపుదల చేయడం దురదృష్టకరమని అన్నారు. ఎంతో ఉన్నత ఆశ యాలతో గత 15 సంవత్సరాల నుంచి పనిచేయచున్న యువకుల సమర్ధత కర్నూలు వరదలు, హూదూద్ తుఫాను వంటివి, సిఆర్డీఏ మాప్స్, మరియు నీరుచెట్టు మ్యాప్ లాంటివి ఎన్నో ప్రాజెక్ట్ చేసిన వీరిని ఉపయోగించు కోవలసింది పోయి వీరికి ఉద్యోగాభద్రత లేకుండా చేస్తూ బెదిరింపులకు పాల్ప డుతున్న డైరెక్టర్ జనరల్ సంజయ్ గుప్తా వైఖరిని ఖండిస్తున్నామన్నారు. అంతే కాక డైరెక్టర్ స్థానికత లేని మరియు వేరే రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులను అత్యధిక జీతాలతో కొనసాగిస్తూ తెలుగు వారిని ఉద్యోగ భద్రత లేకుండా చేస్తూ రోడ్డు పాలు చేసి జీతాలు ఇవ్వకుండా తెలుగు వారి కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఏపీ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ ఎ.ఎమ్.రాజు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయినప్పుడు మన రాష్ట్రంను, మన ఆఫీసును అభివృద్ధి చేసుకుందాం రండి అని టెన్త్ షెడ్యూల్లో ఉన్న మమ్ముల్ని బయటకు తీసుకుని వచ్చి ఆఫీసును అభివృద్ధి చేసిన తరువాత మాకు జీతాలు ఇవ్వకుండా మరియు మా కాంట్రాక్ట్ను కొనసాగించకుండా మా కుటుంబాలను రోడ్డు పాలు చేయడం యాజమాన్యానికి ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. అలాగే రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్కే పెద్ద దిక్కు అయిన మా చైర్మన్గారు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అయిన ఎస్.పి.టక్కర్గారు మాతో మాట్లాడుతూ ఈ ఆఫీసు లో మీరు చాలా సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు,
ఎవరిని తీసివేయము, అందరిని కొనసాగిస్తాం. పే స్కేల్స్ మరియు మూడు నుంచి ఐదు సంవత్సరాల కాంట్రాక్ట్ వీరికి ఇస్తూ ఉత్తర్వులు రెడీ చేయమని డైరెక్టర్ సంజయ్ గుప్తా (ఐఎఫ్ఎస్) గారికి, మరియు వైస్ చైర్మన్ కె.వి.రమణ గారికి ది. 23072016 న ఆదేశాలు జారీ చేసారు. ఆ హామీలనే మేము అమలు చేయమని ప్రభుత్వాన్ని మరియు యాజ మాన్యాన్ని కోరుకుంటున్నామని అన్నారు. ఈ ధర్నాలో సంస్ధ కాంట్రాక్ట్ ఉద్యోగులు జి.కుమారస్వామి, కోటేశ్వరరావు, కనక రాజు, రమేష్ మండల, ఈశ్వర్, అర్జున్, రత్నరాజు, సుందర్, మాధవి, ఎం. రమేష్, జి.శ్రీదేవి, శిరీష, స్వరాజ్యం, కృష్ణవేణి, ప్రసాద్, క్కోజి కుమారస్వామి ఎస్. సురేష్, ఎస్. కుమార్ తదితర కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు.