ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రీన్‌ బిల్డింగ్‌ కార్యక్రమంపై అవగాహనకు కృషిచేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2017, 12:56 AM

  విజయవాడ, సూర్య బ్యూరో :   నవ్యాంధ్ర ప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అన్ని వర్గాల జైనుల సంక్షేమం కోసం జైన మందిరం, అంతర్జాతీయ స్థాయిలో జైనుల పాఠశాలను నిర్మించేందుకు స్థలం కేటాయించాలని కోరుతూ జైనుల పక్షాన జైన్‌ శ్వేతాంబర్‌ తేరాపంతి సభ  అధ్యక్షుడు, జైన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ కార్యదర్శి దినేష్‌ శ్యాంసుఖ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును వెలగపూడిలోని సచివాలయంలో ఆయన ఛాంబర్‌లో కలసి వినతిప్త్రం అందజేశారు. ఈ సందర్బంగా దినేష్‌ శ్యాంసుఖ మాట్లాడుతూ సుమారు 4వ శతాబ్ధం నాటి నుంచి జైనులు ఆంధ్రప్రదేశ్‌లో నివసించారని అందుకు చర్త్రి ఆనవాళ్లు కూడా సాక్ష్యంగా ఉన్నాయని తెలిపారు. అమరావతి, భీమవరం తదితర ప్రాంతాల్లో జైనుల దేవాలయాలు ఉన్నాయని, వాటిలో అమరావతిలో పార్శవనాథ్‌ ఆలయం సుమారు వెయ్యేళ్ల క్రితం నిర్మించిందని, భీమవరంలోని జైనుల ఆలయం సుమారుగా 2600 సంవత్సరాల క్రితం నిర్మించిందని సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించారు.


   వందల సంవత్సరాలుగా జైనులకు సంబంధించిన అన్ని వర్గాలవారు వ్యాపార కేంద్రమైన విజయవాడలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. జైనులు కూడా మైనార్టీ కిందకే వస్తారని తెలిపారు. అదేవిధంగా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో వందలాదిగా జైన మందిరాలు ఉన్నాయని, విజయవాడలో కూడా ఎంతో ఘన చరిత్ర కల్గిన 10 ఆలయాలు జైనులకు సంబంధించి ఉన్నాయని తెలిపారు. జైనులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ర్టవ్యాప్తంగా సుమారు 50 వేల మంది నివసిస్తున్నారని అందులో ప్రధానంగా విజయ వాడలో 15 వేల మంది నివసిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో మైనార్టీలో ఉన్న జైనుల సంక్షేమం కోసం నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అతిపెద్ద జైన దేవాలయం, అంతర్జాతీయ స్థాయిలో పాఠశాల నిర్మాణం చేసుకునేందుకు ప్రత్యేకంగా రాజధాని పరిధిలో స్థలం కేటాయించాలని దినేష్‌ శ్యాంసుఖ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరారు. ఈ సందరేంగా సీఎం చంద్రబాబుకు వినతిప్త్రం అందజేశారు. ఏప్రిల్‌ 9న మహావీర్‌ జయంతి సందరేంగా విజయవాడ పాతబస్తీలో అన్ని వర్గాల జైనులతో జరిగే అహింసా ర్యాలీలో పాల్గొనాలని ఆహ్వానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com