తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు సంప్రదాయం కోసం ప్రతిఏడాది యుద్ధవాతావరణమే కనిపిస్తుంది. సాంప్రదాయ క్రీడను జరిపితీరాల్సిందేనని ప్రజలు, హింసకు తావించే ఏ చర్యలను సహించేది లేదని పోలీసులు పట్టుదలకు పోవడంతో మరోసారి రణరంగంగా మారింది. హోసూర్ సమీపంలో మందకొండపల్లెలో పోలీసులు జల్లికట్టును అడ్డుకున్నారు. ప్రజలు పోలీసుల మాటలను పట్టించుకోకుండా జల్లికట్టును నిర్వహించారు. అడ్డుకోవడానికి వెళ్లిన పోలీసులపై స్థానికులు రాళ్లదాడి చేయగా రెండు వర్గాల ఘర్షణతో రణరంగంగా మారింది. ఈ ఘర్షణలో రెండు వర్గాలలో పలువురికి గాయాలవగా వాహనాలు ధ్వంసమయ్యాయి.