రాజస్థాన్ లోని జైపూర్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తానీ ఖైదీని తోటి ఖైదీలు హత్య చేశారు. షకీరుల్లా అనే ఈ పాకిస్తానీ గూఢచర్యానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై అరెస్టు చేసి ఈ జైలులో ఉంచారు. ఇతన్ని తోటి ఖైదీలు తీవ్రంగా కొట్టడంతో చనిపోయాడని జైలు అధికారులు భావిస్తున్నారు. ముగ్గురు ఖైదీలు హత్య చేశారని ప్రాథమిక సమాచారం.