శ్రీకాకుళం నగర కార్పొరేషన్ జిల్లా గ్రంధాలయ అదనపు భవనానికి స్థానిక శాసన సభ్యురాలు గుండ లక్ష్మిదేవి బుధవారం శంకుస్థాపన చేసారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా కేంద్ర గ్రంధాలయం లో చాలామంది విద్యార్థులు , నిరుద్యోగులకు మంచి పుస్తక పఠనానికి అదనంగా తన MLA నిధుల నుండి 10 లక్షల రూపాయలతో గదుల నిర్మాణానికి ఈ రోజు శంకుస్థాపన చేశామని ,ఆ గదులు వారికి చక్కగా ఉపయోగ పడతాయని చెప్పారు. టీడీపీ హయం లో ముఖ్యమంత్రి సహకారంతో నగరం అన్నివిధాలుగా , అభివృద్ధి జరుగుతోందని, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది అర్హులైన 5000 మంది నగర ప్రజలకు ఇల్లు నిర్మించి ఇచ్చామని చెప్పారు. , 19,000డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ ద్వారా 17 కోట్లు ఇచ్చామని , ఫెన్షన్స్ 2000 పెంపుద్వారా నగరంలో 9000 మందికి ప్రతి నెల 2 కోట్లు ఇస్తున్నామని వివరించారు, ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న టీడీపీ కు, మాకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు
జిల్లా గ్రంధాలయ అధ్యక్షులు పీరుకట్ల విటల్రావు మాట్లాడుతూ తాను అద్యక్షుడుగా వచ్చాక టీడీపీ ప్రభుత్వం హయంలో జిల్లా మంత్రులు, పార్లమెంట్ సభ్యుల MLA ల సహకారంతో గ్రంధాలయాన్ని చాలా అభివృద్ధి చేసానని ఇప్పుడు అదనపు భవనాలకు 10 లక్షల నిధులు మంజూరు చేసినందుకు లక్ష్మీదేవికి ధన్యవాదాలు తెలిపారు.