జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు తీవ్రవాదులను హతమార్చామని భారత ఆర్మీ ప్రకటించింది. జైషే మహమ్మద్కు చెందిన కీలక నేతలను హతమార్చామని ఆర్మీ పేర్కొంది. పుల్వామా దాడి సూత్రధారి కమ్రాన్ పాకిస్తానీ అని, కాశ్మీర్లో జైషే మహ్మద్ ఆపరేషన్ చీఫ్గా వ్యవహరించాడని ఆర్మీ తెలిపింది. పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదుల దాడి దుర్మార్గమని, గతంలో ఇంత పెద్ద బాంబు పేలుళ్లు జరుగలేదని ఆర్మీ పేర్కొంది. జైషే మహ్మద్ అనేది పాక్ ఆర్మీ బిడ్డ అని, పాకిస్తాన్ ఆర్మీయే జైషే మహ్మద్ను పెంచి పోషిస్తోందని ఆర్మీ పేర్కొంది.