భారతదేశంలో తమ హై కమిషనర్ ను పాకిస్తాన్ వెనక్కి పిలిపించింది. పుల్వామా దాడి ఘటన తర్వాత పరిణామాలపై చర్చించడానికి మాత్రమే తమ హై కమిషనర్ ను వెనక్కి పిలిపించామని ప్రకటించింది. అకస్మాత్తుగా వెనక్కి పిలిపించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ యుద్ధానికి దిగుతుందా, దిగితే పరిణామాలు ఎలా ఉంటాయి, రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయా అనేదానిపై చర్చించేందుకు పిలిచారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.