ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుపాను ప్రభావంతో ప్రజలకి సూచనలు ఇచ్చిన విపత్తుల నిర్వహణ సంస్థ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 08:17 PM

దానా తుపాను ప్రభావం నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ప్రజలు కింద సూచించిన జాగ్రత్తలు పాటించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది. ఇవాళ, రేపు సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 


సూచనలు:


1. భారీ వృక్షాలు, చెట్ల దగ్గర / కింద నిల్చోవడం, కూర్చొవడం చేయవద్దు.


2. ఎండిపోయిన చెట్లు / విరిగిన కొమ్మలను తొలగించండి. అలాంటి చెట్ల కింద ఉండవద్దు.


3. వేలాడుతూ, ఊగుతూ ఉండే రేకులు/మెటల్(ఇనుప) షీట్లతో నిర్మించిన షెడ్లకు దూరంగా ఉండండి.


4. పాత భవనాలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకండి.


5. కరెంట్/ టెలిఫోన్ స్థంబాలకు, లైన్లకు, హోర్డింగ్స్‌కు దూరంగా ఉండండి.


6. ప్రయాణంలో ఉన్నట్టయితే వెంటనే సురక్షిత ప్రాంతానికి చేరుకోండి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com