మెళియాపుట్టి మండలం టకోయిలోపల్లిలో కనకమ్మకు చెందిన పుస్తెల తాడును గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేశాడు. శనివారం సాయంత్రం వంట చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి దూరి కరెంట్ మెయిన్ స్విచాఫ్ చేసి ఆమె మెడలోని మూడున్నర తులాల పుస్తెలతాడు తెంపుకొని పారిపోయాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి దొంగను వెతికారు. కనిపించకపోవడంతో ఆమె భర్త కృష్ణమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.