న్యూజిలాండ్లో ఈరోజు ఉదయం స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. ఎల్ఎస్పెరెన్స్ రాక్కు ఆగ్నేయంలో 248 కిలోమీటర్ల దూరంలో పది కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రీకృమైనట్టు అమెరికా జియలాజికల్ సర్వే వెల్లడించింది. ముందస్తు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. పసిఫిక్ తీరంలోని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ జోన్లో ఉన్న న్యూజిలాండ్లో తరచూ భూకంపాలు, అగ్ని పర్వత విస్ఫోటాలు జరుగుతుంటాయి. గతేడాది అక్టోబర్లో 6.2 తీవ్రతతో చోటు చేసుకున్న భూ ప్రకంపనలు రాజధాని వెల్లింగ్టన్ను వణికించింది. దీంతో పార్లమెంటును కూడా కొద్ది సేపు వాయిదా వేయాల్సి వచ్చింది. 2011లో 6.3 తీవ్రతతో చోటుచేసుకున్న భూకంపం క్రైస్ట్ చర్చ్ నగరాన్ని అతలాకుతలం చేసింది. దీనికారణంగా 150 మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మందికి గాయాలయ్యాయి.