మహారాష్ట్రలో గిరిజనులు ఉగ్రరూపం దాల్చారు. అటవీశాఖ అధికారులు, పోలీసులపై దాడి చేశారు. అమరావతిలోని మేల్ఘాట్ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రభుత్వం వాహనాలను, ఆస్తులను గిరిజనులు ధ్వంసం చేశారు. ఈ దాడిలో 45 మంది అటవీశాఖ సిబ్బందితో పాటు 20 మంది పోలీసులు గాయపడ్డారు. వారంతా ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల మేల్ఘాట్కు చెందిన కొందరు గిరిజనులకు అకోలాలో పునరావాసం కల్పించారు.అయితే పునరావాసం కల్పించిన వారికి పూర్తి ఏర్పాట్లు చేయలేదు. దీంతో గిరిజనులు అక్కడ నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. వాళ్లను నివారించే క్రమంలో ఘర్షణ చోటుచేసుకున్నది. అది తీవ్రరూపం దాల్చింది.