ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా మాజీ ఛైర్మన్, ఎండీ అరవింద్ జాదవ్పై సీబీఐ కేసు నమోదైంది. ఎయిరిండియా నియామకాల్లో జాదవ్ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. కెప్టెన్ ఎ.కథ్పాలియా, కెప్టెన్ అమితాబ్ సింగ్, కెప్టెన్ రోహిత్ భాసిన్, అప్పటి ఎయిరిండియా జనరల్ మేనేజర్లకు ప్రయోజనాలు చేకూర్చేలా జాదవ్ నియామకాలు చేపట్టారని ఆరోపణలు వచ్చాయి. దీంతో దర్యాప్తు చేపట్టిన సీబీఐ జాదవ్తో పాటు ఎయిరిండియా మాజీ సీనియర్ ఉద్యోగులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.