ప్రధాని మోడీ 2015, జనవరి 22 ఎంతో ఘనంగా ప్రారంభించిన "బేటీ బచావో.. బేటీ పడావో" పథకం ఆఫీసుల్లో కాగితాలకే పరిమితమవుతోంది. ఈ పథకానికి కేటాయించిన నిధుల్లో దాదాపు 56శాతం కేంద్ర ప్రభుత్వం ప్రచారానికి ఖర్చు చేసింది. ఈ ప్రథకం ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరటం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా బాలల సెక్స్ రేషియో తగ్గించేందుకు, ఆడపిల్ల పట్ల తల్లిదండ్రుల మైండ్ సెట్ మార్చడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే... దీన్ని ద్వారా లక్ష్యం నెరవేరటం లేదని అర్థమవుతోంది. మహిళా శిశు సంక్షేమ శాఖ, హెల్త్ అండ్ ఫ్యామిలీ సంక్షేమం, మానవ వనరుల అభివృద్ధి శాఖల ద్వారా ఈ లక్ష్యాన్ని నెరవేర్చాల్సి ఉంది. నాలుగేళ్ల తర్వాత తెలిసిన విషయం ఏమంటే... ఆ పథకాన్ని కేటాయించిన నిధుల్లో 56 శాతం మీడియాల్లో ప్రచారానికే కేంద్ర ఖర్చు చేసిందనే విషయం తెలిసింది. ఇందులో 25 శాతం నిధులు జిల్లా, రాష్ట్రాలకు పంపిణీ చేశాయి. 19 శాతానికి పైగా నిధులు విడుదల చేయలేదని తెలిసింది.