ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రుషికొండ భవనాలను ప్రభుత్వం వినియోగించుకుంటుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 19, 2024, 03:51 PM

విశాఖ రుషికొండపై నిర్మించిన భవనాలను ఎన్డీయే ప్రభుత్వం కచ్చితంగా ఉపయోగించుకుంటుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. భవనాలను ఏ విధంగా ఉపయోగించాలనే దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని మంత్రి చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం మాదిరిగా తాము ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయమన్నారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం అమరావతిలో ప్రజావేదికను కూల్చివేయడాన్ని గుర్తు చేశారు. అలాంటి పనులు ఎప్పటికీ తమ అధినేత చేయరన్నారు. ప్రభుత్వ డబ్బు వృథా కానివ్వమని, నష్టం కలిగించేలా వ్యవహరించమని వెల్లడించారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో నిలబడలేకపోతున్నారని, వారు ఎవరెవరితో టచ్‌లో ఉన్నారనే విషయాన్ని మాత్రం చెప్పనన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com