ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడ్ని అరెస్టు చేసినట్టు పాడేరు ఏఎస్పీ కె.ధీరజ్ తెలిపారు. సీఐ డి.నవీన్కుమార్, ఎస్ఐ జి.లక్ష్మణరావుతో కలిసి సోమవారం సాయంత్రం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. మోదకొండమ్మ ఉత్సవాలకు వచ్చిన బాలికపై ఈ నెల 10న అర్ధ రాత్రి ఆరేళ్ల అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు చెప్పారు. రెండు బృందాలతో నిందితుడి ఆచూకీ కోసం గాలింపులు చేపట్టారన్నారు. సీసీ కెమెరాల్లోని పుటేజీలు, బాధితురాలైన బాలిక చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా తమ సిబ్బంది ఘాట్లోని 12వ మైలు గ్రామం సమీపంలో సోమవారం నిందితుడ్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారన్నారు. విచారణలో బాలికపై అతనే అత్యాచారానికి ఒడిగట్టాడని నిర్ధారణ జరిగిందన్నారు. ఇందుకు కృషి చేసిన సీఐ, ఎస్ఐ, క్రైమ్ సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు.