మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని మంత్రి లోకేశ్కు తమ సమస్యలను విన్నవిస్తున్నారు. చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు ప్రతి ఒక్కరి నుంచి ఒపిగ్గా వింటున్నారు. తన పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే లోకేష్ పరిష్కరిస్తున్నారు. పరిష్కారం కాని సమస్యలను సంబధిత విభాగాల అధికారులకి పంపి పరిష్కార మార్గం చూపుతున్నారు. తన వద్దకు వచ్చిన ప్రజల కష్టాలు వింటూ...కన్నీళ్లు తుడుస్తూ...! మీ వెంట నేనున్నాంటూ ”ప్రజాదర్బార్” లో లోకేష్ భరోసా ఇస్తున్నారు.