గత ఐదేళ్లు కొంతమంది పోలీసులు వైసీపీ సేవలోనే తరించారని, టీడీపీ నేతలను వేధించడంలోనే మునిగితేలారని మంత్రి అనిత అన్నారు. తాము పోలీసులకు అన్ని సదుపాయాలూ కల్పిస్తామని, పనితీరు కూడా అదేస్థాయిలో ఉండాల్సిందేనని చెప్పారు. ఇప్పటికైనా ప్రజా పోలీసింగ్ చేయాలని, అలాకాకుండా ఎవరికైనా ఇంకా జగన్పై ప్రేమ ఉంటే తక్షణం లూప్లైన్లోకి వెళ్లిపోవాలని హోం మంత్రి స్పష్టం చేశారు. పోలీస్ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామన్నారు. పోర్టులోకి 2,500 కిలోల హెరాయిన్తో కంటైనర్ రాక కేసుపై కూడా దృష్టిపెడతామన్నారు. కాగా, రాష్ట్రంలో గంజాయి రవాణా, వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు వీలుగా వారంరోజుల్లో టోల్ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేయనున్నట్టు హోంమంత్రి చెప్పారు.