పలాస, కేటీ రోడ్డు పలాస ఎస్ఆర్ పెట్రోలు బంకు వద్ద సోమవారం మధ్యా హ్నం కారును ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒడిసా రాష్ట్రం రామగిరి గ్రామా నికి చెందిన సవర జోగారావు, సవర సంతోష్ సావత్కు తీవ్ర గాయాలయ్యా యి. గొప్పిలి గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై వీరు వస్తుండగా ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదదాటికి కారు ముందు భాగం నుజ్జయింది. అందులో ప్రయాణిస్తు న్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుప త్రిలో చేర్పించగా శ్రీకాకుళం రిమ్స్కు తరలిస్తున్నట్టు వైద్యాధికారులు తెలిపారు. ఎస్ఐ పారినాయుడు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.