రాష్ట్ర మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా సాలూరు ఎమ్మెల్యే గుమ్మిడి సంధ్యారాణి సోమవారం రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎం నియమాకానికి సంబంధించిన ఫైల్పై ఆమె తొలి సంతకం సంతకం చేశారు. ఈ నెల 12న సంధ్యారాణి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా వెలగపూడి సచివాలయం మూడో బ్లాక్ తొలి అంతస్తులో కేటాయించిన చాంబర్లో రాష్ట్రమంత్రి ఆమె అడుగుపెట్టారు. తల్లి పార్వతమ్మ, భర్త జయకుమార్, కుమారుడు పృథ్వీ , పార్టీ శ్రేణులు, అధికారులతో వెళ్లి పూజలు చేసిన అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పక్కనే ఉన్న తల్లి చేతులను పట్టుకొని ఆశీస్సులు తీసుకున్నారు.