రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా కీలకమైన ఐదు అంశాలపై సంతకాలు చేశారని కాకినాడరూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, కో కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ (బాబీ) అన్నారు. శుక్రవారం వలసపాకలలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, 47వ డివిజన్ కరణంగారి సెంటర్లో బాబీల ఆధ్వర్యంలో వివిధ వర్గాల లబ్ధిదారులు, పార్టీ కేడర్తో కలసి సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కర్రి వెంకట్రాజు, జి.శ్రీనివాసరావు, బొజ్జ భవాని, వేటుకూరి నాగమణి, పలివెల గాయత్రి, ఎం. శ్రీనివాసరావు, కాకరపల్లి చలపతిరావు, జంక్షన్ బాబ్జి, కౌజు నెహ్రూ, వెంకటలక్ష్మి, గీసాల శ్రీనివాసరావు, కె వినాయక్ తదితరులు పాల్గొన్నారు.