ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు తమనేత ముఖ్యమంత్రి చంద్రబాబు అని తుని ఎమ్మెల్యే యనమల దివ్య స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీపై చేసి వేలాదిమంది నిరుద్యోగుల ఆశలకు ఊపిరిపోశారన్నారు. 16,347 టీచర్స్ పోస్టు భర్తీకి నిర్ణయం తీసుకోవడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. . నైపుణ్యగణనపై ఐదో సంతకం, నిరుద్యోగ యువతకు భవిష్యత్కు భరోసా ఇచ్చేలా ఉందన్నారు. ఆమె వెంట స్థానిక టీడీపీ నాయకులు యనమల రాజేష్, సుర్ల లోవరాజు, చింతమనీడి నాగ సోమరాజు, మోతుకూరి వెంకటేష్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి ఉన్నారు.