బాల్య వివాహాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కదిరి ఆర్డీవో వంశీకృష్ణ, డీఎస్పీ శ్రీలత సూచించారు. కదిరి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం ఐసీడీఎస్ పీడీ లక్ష్మీకుమారి అధ్యక్షతన బాల్యవివాహాల నివారణపైౖ డివిజనలోని మండలస్థాయి అధికారులతో సమావేశం జరిగింది. ఇందులో ఆర్డీఓ, డీఎస్పీ ముఖ్యఅతిథిగా హాజయ్యారు. ముందుగా వారు బాల్యవివాహాల నివారణకు సంబంధించిన వాల్పోస్టర్లు విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ బాల్యవివాహాలు ఎక్కువగా జరిగే మండలాలు, గ్రామాలను గుర్తించి అక్కడి ప్రజలకు వాటి నిర్మూలనపై అవగాహన కల్పించాలన్నారు. వాటి వల్ల కలిగే నష్టాలు, అనారోగ్య సమస్యల గురించి వివరించాలన్నానరు. ప్రస్తుతం సమాజం ఎంతో అభివృద్ధి చెందుతున్నా బాల్యవివాహాలు జరుగుతుండడం దురదృష్టకరమన్నారు. ఇకపై జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే ప్రజలు ఛైల్డ్ హెల్ప్లైన 1098కు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో డివిజనలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఐసీడీఎస్ సీడీపీఓలు, స్వచ్చంధ సంస్థ ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.