పోలీస్ సిబ్బంది సమస్యలను పరిష్కరించడానికి సత్వర చర్యలు తీసుకోనున్నట్లు ఏలూరు జిల్లా ఎస్పీ డి.మేరీ ప్రశాంతి అన్నారు. ఏలూరు జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి ఉన్న శాఖాపరమైన సమస్యలపై జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం విచారణ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో నిమగ్నమైన సిబ్బంది సమస్యలు పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అం దించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న సివిల్ సిబ్బంది, పలువురు వచ్చి తమ సమస్య లను ఎస్పీకి తెలిపారు.