ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుమానాస్పదంగా అన్నదమ్ములు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 15, 2024, 07:00 PM

రాజమహేంద్రవరం శంభునగర్‌లో రైల్వే ఫ్లైఓవర్ పైనుంచి దూకి ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఫ్లై ఓవర్ పైనుంచి దూకడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కుటుంబకలహాలతో ఆత్మహత్య చేసుకున్నారా, లేక మరేదైనా కారణం ఉందా? అని పలు కోణాల్లో విచారణ చేపట్టారు. ఒకేసారి ఇద్దరు మృతిచెందడంతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. ఘటన గురించి తెలియడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com