డోన్ నియోజకవర్గంలో రైతులకు సాగు, ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఎమ్మెల్యే కోట్ల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా వివిధ శాఖల అధికారులతో పరి చయ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఇరిగేషన్ శాఖ అధికా రులతో, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. రైతులకు సాగునీరు అందించేందుకు చెరువులకు నీళ్లు నింపే ప్రాజెక్టుకు పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువులకు నీళ్లు నింపి రైతులను ఆదుకోవడమే తన లక్ష్యమని కోట్ల అన్నారు. రైతు లకు సాగునీరు అందించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయా లని ఇరిగేషన్ అధికారులను ఎమ్మెల్యే కోట్ల ఆదేశించారు. డోన్ నియోజ కవర్గంలో వాటర్ ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో వాటర్ ప్రాజెక్టు పనులను పరిశీలిస్తానని ఇంటింటికి కొళాయి ఏర్పాటు చేసి స్వచ్ఛమైన నీటిని అందించేలా త్వరి తగతిన పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అదేవిధంగా పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, మండల పరిషత్, విద్యుత్, వ్యవసాయ శాఖ, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మీ శాఖల పరిధిలో ఏ ఏ అభివృద్ధి పనులు జరుగుతు న్నదీ వివరాలతో తదుపరి సమావేశానికి హాజరు కావాలని అధికారు లను ఆదేశించారు. కార్యక్రమంలో రాష్ట్ర గొర్రెల పెంపకందారుల పెడరే షన్ చైర్మన్ వై. నాగేశ్వరరావు యాదవ్, డోన్ ఆర్డీవో మహేశ్వరరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రికే హరికిషణ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు వలసల రామక్రిష్ణ, కోట్రికే ఫణిరాజ్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ టీఈ కేశన్నగౌడు, మాజీ సర్పంచ్ కేశవయ్యగౌడు, మాజీ ఎంపీపీ శేషఫణిగౌడు, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి విజయభట్టు, ఓబులాపురం శేషిరెడ్డి, మర్రి రమణ, టీడీపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్, భాస్కర్ నాయుడు, విజయకుమార్ రెడ్డి, తహసీల్దార్ మాధవకృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ డా. జయరాం, పీఆర్ ఏఈ నారాయణ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.