శ్రీవారిని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామి శనివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని తరించారు. ముందుగా అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన సుప్రభాత సేవలో పాల్గొన్నారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తిరుమలకు కుమారస్వామి రావడం ఇదే తొలిసారి. తాజాగా లోక్ సభ, పలు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు, కేంద్ర, రాష్ట్రాల క్యాబినెట్లో స్థానం దక్కిన వారూ వరసగా తిరుమలకు క్యూ కడుతున్నారు.