మరోసారి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ సమయోచితంగా ఆడుతుండడంతో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే ఓపెనర్ రోహిత్ శర్మ (9) వికెట్ కోల్పోయింది. అనంతరం 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ధవన్ కూడా నిష్క్రమించాడు. అయితే కోహ్లీ, ధోనీ మరోసారి సంయమనంతో ఆడుతుండడంతో భారత్ వంద పరుగుల మార్కును దాటింది. భారత్ ప్రస్తుతం 29 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. కోహ్లీ (43 నాటౌట్), ధోనీ (34 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో సిడిల్, స్టోయిన్స్ చెరో వికెట్ పడగొట్టారు. భారత్ విజయ లక్ష్యానికి మరో 121 పరుగుల దూరంలో ఉంది.