తెలుగుజాతి గుండెల్లో ఎన్టీఆర్ ఎప్పటికీ ఉంటారని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన 36 అడుగుల భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈసందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ఎన్టీఆర్ ఒక మహానాయకుడు, యుగ పురుషుడన్నారు. సత్తెనపల్లికి వన్నె తెచ్చేలా తారకరామ సాగర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ తో కోడెలకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. బసవతారకం ఆస్పత్రి ఏర్పాటులో కోడెలది కీలకపాత్ర అన్నారు.