అమరావతి : దేశంలోని బీజేపీయేతర పక్షాలన్నిటినీ ఆహ్వానించి.. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్కతాలో నిర్వహిస్తున్న ర్యాలీకి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. 19వ తేదీన జరిగే ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఆయన శుక్రవారం (18న) సాయంత్రమే బయల్దేరి వెళ్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో రాజకీయ వేడి పెరగడం, అదే సమయంలో జాతీయ రాజకీయాలను సమన్వయం చేయడంలో బిజీగా ఉండడంతో చంద్రబాబు తన దావోస్ పర్యటనను రద్దుచేసుకున్నారు.
ఫిబ్రవరి చివరిలో ఎన్నికల నోటిఫికేషన్ రానుండడం.. ఈలోపు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో చేయాల్సిన పనులతో తీరికలేకుండా ఉండడంతో పర్యటనను రద్దుచేసుకున్నారు.