ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధూమ్ సినిమా రేంజ్‌లో హైవేపై చోరీ.. ట్రక్కు నుంచి ముగ్గురు దొంగత

national |  Suryaa Desk  | Published : Sat, May 25, 2024, 10:48 PM

మనం సినిమాల్లో ఎన్నో దొంగతనాలు చూస్తూ ఉంటాం. ఇంకా కొన్ని సినిమాలు అయితే దొంగతనాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అయితే అలాంటి చోరీల్లో దొంగలు ప్రాణాలకు తెగించి.. విలువైన వస్తువులు, డబ్బులు, నగలు చోరీ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ దొంగతనం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హైవేపై ఓ ట్రక్కు వెళ్తుండగా.. దాని వెనకాలే వెళ్లిన ముగ్గురు దొంగలు.. దాన్ని ఎక్కి.. ట్రక్కులో ఉన్న మూటలను హైవేపై పడేశారు. అనంతరం.. ట్రక్కుపైనుంచి బైక్‌పై దిగి.. ఆ సామాన్లు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దొంగతనానికి సంబంధించిన వీడియోను.. అదే హైవేపై వేరే వాహనంలో వెళ్తున్న కొందరు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.


మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో ఆగ్రా- ముంబై జాతీయ రహదారిపై ఈ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. హైవేపై వేగంగా వెళ్తున్న ట్రక్కు నుంచి కొందరు దొంగలు సామాన్లు దొంగిలించడం సంచలనంగా మారింది. బైక్‌పై వెళ్లిన ముగ్గురు దొంగలు.. ట్రక్కును వెంబడించి.. దాని వెనకాలే వెళ్తూ.. బైక్‌పై నుంచి ఇద్దరు వ్యక్తులు ఆ ట్రక్కుపైకి రన్నింగ్‌లోనే ఎక్కారు. మూడో వ్యక్తి బైక్‌ను నడుపుకుంటూనే ట్రక్కును వెంబడించాడు. ఇక ఆ ట్రక్కుపైకి ఎక్కిన ఇద్దరు వ్యక్తులు.. ఆ లోడ్‌లో నుంచి కొన్ని సామాన్లను తీసి హైవేపై పడేశారు. అనంతరం మళ్లీ ఆ ట్రక్కు నుంచి బైక్‌పైకి కదులుతుండగానే దిగారు. ఆ తర్వాత హైవేపై పడేసిన సామాన్లను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.


ఇక ఆ ముగ్గురు దొంగలు.. ట్రక్కును వెంబడించడం.. తర్వాత బైక్‌పై నుంచి ఎక్కి ట్రక్కులోని సామాన్లను దొంగిలించిన సంఘటనకు సంబంధించిన వీడియోలను ఆగ్రా - ముంబై జాతీయ రహదారిపై కారులో వెళ్తున్న మరికొందరు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోకు నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఇలాంటి దొంగతనాలు సర్వసాధారణం అని కొందరు కామెంట్లు పెడుతుండగా.. సినిమా రేంజ్‌లో చోరీ చేశారని పేర్కొంటున్నారు. సినిమాలు చూసి దొంగతనం చేసే విధానాలు కూడా మారిపోయాయని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.


అయితే ఈ దొంగతనంలో డ్రైవర్ పాత్ర కూడా ఉందని కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇక షాజాపూర్ సమీపంలో ఆగ్రా - ముంబై హైవేపై పట్టపగలే దొంగతనాలు జరగటం మామూలేనని స్థానికులు తెలియజేస్తున్నారు. ట్రక్కు డ్రైవర్లు కూడా దొంగతనాలపై ఎన్నో ఫిర్యాదులు చేసినా.. స్థానిక పోలీసులు పట్టించుకోరని పేర్కొన్నారు. ఇక తాజా దొంగతనం వీడియో వైరల్ కావడంతో స్థానిక పోలీసుల పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ హైవేపై నిత్యం దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com