అలహాబాద్ : రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఆయన సతీమణి గురువారం కుంభమేళాలో పాల్గొన్నారు. అలాహాబాదుకు వచ్చిన రాష్ట్రపతి దంపతులు సంగమ ప్రాంతంలో గంగా పూజ చేశారు. రాష్ట్రపతి దంపతులు ప్రత్యేక విమానంలో ఉదయం తొమ్మిదిన్నర గంటలకు బాంరౌలి విమానాశ్రయానికి వచ్చారు. వారికి గవర్నర్ రాంనాయక్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మంత్రులు స్వాగతం పలికారు.