మైదుకూరు నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి శెట్టిపల్లి రఘురాంరెడ్డి శుక్రవారం నియోజకవర్గ ప్రజలకు వైసీపీ కార్యకర్తలకు ఓ ప్రకటనలో తెలియజేస్తూ అందరూ సమన్వయం పాటించాలన్నారు. ఎటువంటి గొడవలకు వెళ్లొద్దన్నారు. 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికలలో మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడమే కాకుండా శ్రమించి మన గెలుపు కోసం కృషి చేశారని అందుకు అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు.