ఆటో బైక్ ను ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై పోలీసుల కథనం. బి కొత్తకోట మండలం, తుమ్మనగుట్ట పంచాయతీ, సుంకరవారిపల్లెకు చెందిన రామస్వామి, భార్య నారాయణమ్మ, ఈశ్వరమ్మలు గురువారం రాత్రి బైక్లో సొంతపనిమీద ములకలచెరువు మండలం, బురకాయలకోట, గ్రామం, గండువారిపల్లెకు బయలుదేరారు. మార్గమధ్యంలోని బురకాయలకోట పెట్రోల్ బంకువద్దకు వెళ్లగానే ఆటో ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు.