10వతరగతి, ఇంటర్లలో ప్రతిభ కనబరిచిన ఉప్పర, సగర విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించనున్నట్లు శ్రీ భగీరథ ఎడ్యుకేషనల్ సేవా ట్రస్ట్ వారు శుక్రవారం తెలిపారు. 2024లో పదవతరగతిలో 375 మార్కులు, ఇంటర్ పూర్తి చేసుకున్న, 600 మార్కులపైన వచ్చిన విద్యార్థులకు ప్రతిభా ప్రోత్సాహక పురస్కరాలు ఉంటాయన్నారు. ప్రతిభా విద్యార్థులకు ఈ నెల 25 లోపు పరిగిరోడ్డు నందు గల మధుర మీనాక్షి కళ్యానమంటపంలో నమోదు చేసుకోవాలన్నారు.