న్యూఢిల్లి : ఉన్నత వర్గాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎన్నికల స్టంట్గా కొట్టిపారేసింది. ఒకవేళ నిజంగా ఉన్నత వర్గాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశ్యం ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వానికి నిజంగా ఉన్నట్లయితే, రాజ్యాంగ సవరణ కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి చర్చించాలని ఆప్ డిమాండ్ చేసింది. గతంలో వివిధ రాష్ట్రాలు ఈ రకమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని పేర్కొంటూ కోర్టులు వాటిని రద్దు చేశాయని ఆప్ ఎంపి సంజయ్ సింగ్ చెప్పారు.