కర్నూలు జిల్లాలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఢిల్లీ పర్యటనకు ముందు జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు ప్రపంచంలోనే అతి పెద్దదైన అల్ట్రామెగా సోలార్ పార్క్తో పాటు ఓర్వకల్లు సమీపంలోని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టును ప్రారంభించి జాతికి అంకింతం చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.