విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ప్రకాశం జిల్లా కొనకనమిట్లలో 3 సెం.మీ, అనంతపురం జిల్లా నల్లమడలో 3, అనంతపురంలో 2, పెనుగొండలో 2, తాడిపత్రి, తాడిమర్రి, మడకశిరల్లో ఒక సెంటీమీటరు చొప్పున, చిత్తూరు జిల్లా పాలసముద్రంలో 2 సెం.మీ, నగరిలో 2, గోరంట్లలో 2, విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో 2, వేపడ, బొబ్బిలి, కర్నూలు జిల్లా ఆలూరులో 1 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.