రాష్ట్రంలో ఉన్న చుక్క భూములకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. గురువారం అమరావతి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి మరియు సిసిఎల్ మన్ మోహన్ సింగ్,ముఖ్యమంత్రి వర్యుల ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్ లతో ఈఅంశంపై సమీక్షించారు.ఈసందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చుక్క భూములు అందుకు సంబంధించి పరిష్కరించాల్సిన అంశాలపై అధికారులతో ఆయన సమీక్షించారు.జిల్లాల వారీ చుక్కభూములు వివరాలను తెల్సుకుని వాటికి సంబంధించిన సమస్యలను ఏవిధంగా పరిష్కరిస్తుందీ ఆరా తీసారు.ఇంకా చుక్క భూములకు సంబంధించిన వివిధ అంశాలను సిఎస్ రెవెన్యూ ఉన్నతాధికారులతో ఈసమావేశంలో చర్చించారు.