ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"హెరిటేజ్ సంస్థ మోహన్‌బాబుది.. అబద్ధమైతే నన్ను చెప్పుతో కొట్టండి"

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2024, 07:21 PM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మీద ఏపీ చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్, సినీ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తమ ఓట్లను టీడీపీకి వేయమని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. అలా అనడం వ్యభిచారంతో సమానమంటూ పోసాని కృష్ణమురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన పని కాపులను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. ఇక ఏపీలో మహిళ అక్రమ రవాణా జరుగుతోందంటూ పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలపైనా పోసాని కృష్ణ మురళి విరుచుకుపడ్డారు.


మహిళల అక్రమ రవాణా గురించి పవన్ కళ్యాణ్ నిరాధార ఆరోపణలు చేశారనీ.. అసలు ఆ ఆరోపణల్లో న్యాయం ఉందా అంటూ పోసాని ప్రశ్నించారు. ఏపీలోని మహిళలు ఎవరి ఊర్లళ్లో వాళ్లు సంతోషంగా పనిచేసుకుంటూ ఉంటే ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్ జీవితంలోనే అతిపెద్ద తప్పు చేశారని పోసాని మండిపడ్డారు.తన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ సిగ్గుపడాలని.. ఏపీలోని ఆడబిడ్డలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం కాపు మహిళల కాళ్లు పట్టుకుని క్షమాపణలు ఆడగాలని పోసాని డిమాండ్ చేశారు.


ఇదే క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపైనా పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.హెరిటేజ్ సంస్థ మోహన్ బాబుదన్న పోసాని కృష్ణమురళి.. ఈ విషయం తనకు తప్ప మిగతావాళ్లకు పెద్దగా తెలియదన్నారు. మోహన్ బాబును మోసం చేసి హెరిటేజ్ సంస్థను తీసుకున్నారని ఆరోపించారు. ఈ విషయం అబద్ధమని అనుకుంటే తనకు నార్కోటెస్ట్ చేయించాలన్న పోసాని కృష్ణమురళి.. అబద్ధమని తేలితే తనను లైవ్‌లోనే చెప్పుతో కొట్టండి అంటూ సవాల్ చేశారు.


జయప్రదను ఎలా అవమానించారో అందరికీ తెలుసన్న పోసాని.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన మంచి పథకాలను చంద్రబాబు అధికారంలోకి రాగానే నాశనం చేశాడని విమర్శించారు. ఇప్పుడేమో సీఎం అవ్వడానికి ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలన్నీ తెస్తామని అబద్ధపు హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు.ఇక కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిగా చంద్రబాబు కోసం పాదయాత్ర చేస్తానన్న పోసాని కృష్ణమురళి.. గెలిచి సీఎం అయిన తర్వాత అయినా చంద్రబాబు నార్కో టెస్టుకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com