శ్రీకాకుళం : ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కాంగ్రెస్ పార్టీతో కూటమి కట్టామని టిడిపి నేత అచ్చెన్నాయుడు చెప్పారు. ఇక్కడ జరుగుతున్న ధర్మ పోరాట దీక్ష సభలో ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం మరణ శయ్యపై ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని కుట్రలు పన్నుతున్నారని ఆయన చెప్పారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా, చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నారని ఆయన అన్నారు. బిజెపియేతర పార్టీలను ఏకం చేసేందుకు చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారన్నారని ఆయన అన్నారు.