ఢిల్లీలో నరేంద్రమోడీ ఉలిక్కిపడేలా మనం గర్జించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ… విభజన వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. హైదరాబాద్ ను అభివృద్ది చేసిన ఘనత టీడీపీదేనన్నారు. విభజన తర్వాత కట్టుబట్టలతో అమరావతికి వచ్చామన్నారు. ఎంతో అప్పు నెత్తిన పెట్టుకొని ఇక్కడికి వచ్చామన్నారు. ఎన్టీఆర్ కు శ్రీకాకుళం అంటే ఎనలేని అభిమానమన్నారు. తెలుగువారు ఎక్కడున్నా… తెలుగువారికి ఇబ్బందులు వస్తే పోరాటం చేస్తామన్నారు.