అమరావతి: పోలవరం ప్రాజెక్టు పూర్తయితే.. వైఎస్ జగన్కు పుట్టగతులుండవని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈనెల 26న అనంతపురం జిల్లాలో ధర్మపోరాట దీక్ష చేస్తున్నామన్నారు. కేంద్రం చేసిన నయవంచనకు నిరసనగా టిడిపి పోరాటం చేస్తుందన్నారు. వెనుకబడిన జిల్లాలకు నిధులిచ్చి మళ్లీ వెనక్కి తీసుకుందన్నారు. కేసీఆర్తో చేతులు కలిపి తెలుగుజాతి ద్రోహానికి పాల్పడుతున్నారన్నారు.