అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు యూరప్ పర్యటనకు వెళ్లారు. కుటుంబంతో కలసి యూరప్ కు బయల్దేరారు. తన కుమారుడు శంకర పవనోవిచ్ కు క్రిస్టియన్ మతాచారాల ప్రకారం చేయాల్సి ఉన్న కొన్ని లాంఛనాలను ఈ క్రిస్ట్ మస్ సందర్భంగా పూర్తి చేద్దామని పవన్ ను ఆయన సతీమణి అన్నా లెజనోవా కోరారు. ఈ నేపథ్యంలో, కుటుంబంతో కలసి ఆయన బయల్దేరారు. క్రిస్ట్ మస్ తర్వాత వారు మళ్లీ హైదరాబాదుకు తిరుగుపయనమవుతారు. యూరప్ పర్యటన తర్వాత అమరావతిలో పార్టీ శ్రేణులకు ఆయన పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండనున్నారు.